న్యూఢిల్లీ: సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ 2024-–25 సంవత్సరానికి అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్అండ్ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు పరిశ్రమల సంఘం మంగళవారం వెల్లడించింది. స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పదవీకాలంలో ముగియడంతో నాయర్ బాధ్యతలు తీసుకున్నారు
నాయర్ సిటీ గ్రూపులో 25 సంవత్సరాలు, కేకేఆర్లో దాదాపు 14 సంవత్సరాలు పనిచేశారు. గ్లోబల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ మార్కెట్లలో నాలుగు దశాబ్దాలపాటు పనిచేశారు. తన భార్య ఫల్గుణి నాయర్ స్థాపించిన నైకాలో నాన్-–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు.