కోకాపేటలో పోలీసుల మెరుపుదాడులు

కోకాపేటలో పోలీసుల మెరుపుదాడులు

రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలపై నిఘా ఉంచిన ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే చాలు సోదాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కోకాపేటలో అక్రమంగా మద్యం నిల్వచేసిన ఇంటిపై మాదాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు దాడులు నిర్వహించారు. పోలింగ్ కు ముందు మద్యం దుకాణాలు బంద్ చేస్తారని తెలిసి మందు బాబుల కోసం  ముందు జాగ్రత్తగా అక్రమంగా నిల్వ చేసిన  మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రియ దారుడు బల్ రాజ్ ను అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులకు  అప్పగించారు. ఇతని వద్ద పట్టుబడిన మద్యం నిల్వల విలువ ఒక లక్ష 15వేల  రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు రెండు రోజులు బంద్ చేస్తుండడంతో కోకాపేట ప్రాంతానికి చెందిన రాజు లక్షల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో డంప్ చేశాడు. ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్మడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ ఎస్ ఓ టి పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.