హైదరాబాద్సిటీ, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు 14 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రైలు టకెట్ల బుకింగ్స్ కూడా కొనసాగుతోంది. రద్దీని తట్టుకునేందుకు రైల్వే అధికారులు సొంతూర్లకు వెళ్లే వారి కోసం బుకింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రెయిన్నెం. 07041 సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య 2026 జనవరి 4, 11,18,తేదీలు.. ఆదివారాల్లో 3 సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే.. ట్రెయిన్నెం.07042 అనకాపల్లి – సికింద్రాబాద్ మధ్య జనవరి 5,12,19 తేదీల్లో సోమవారాల్లో 3 సర్వీసులు, ట్రెయిన్నెం. 07075 హైదరాబాద్–గోరఖ్పూర్ మధ్య శుక్రవారాల్లో జనవరి 9,16,23 తేదీల్లో 4 సర్వీసులు, ట్రెయిన్నెం. 07076, గోరఖ్పూర్–హైదరాబాద్ మధ్య ఆదివారాల్లో జనవరి 11,18,25 తేదీల్లో 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

