జూన్ 1 నుంచి 44 సమ్మర్​ వీక్లీ స్పెషల్​ రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

జూన్ 1 నుంచి 44 సమ్మర్​ వీక్లీ స్పెషల్​ రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
  • వచ్చే నెల 1 నుంచి జులై 31 వరకు సర్వీసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వీక్లీ స్పెషల్ ​ట్రైన్స్​ ప్రవేశపెట్టామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్​ కేంద్రంగా బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు  44 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి ఆదివారం ట్రైన్ ​నంబర్  ​08581 విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూన్​1 నుంచి 29 వరకు 5 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. 

ట్రైన్​ నంబర్​08582  ఎస్ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం మధ్య ప్రతి సోమవారం జూన్​ 2  నుంచి 30 వరకు 5 సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట, జోలార్​పట్టి, కుప్పం, బంగార్​పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ‘‘ట్రైన్​ 
నంబర్​ 08547 విశాఖపట్నం– తిరుపతి మధ్య ప్రతి బుధవారం జూన్​4 నుంచి జులై 30 వరకు 9 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

అలాగే, ట్రెయిన్​ నంబర్  08548 తిరుపతి – విశాఖపట్నం మధ్య ప్రతి గురువారం జూన్​5 నుంచి జులై 31 వరకు 9 సర్వీసులు నడుస్తాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలిమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరంటౌన్, కల్కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్​లలో ఆగుతాయి. ట్రైన్​ నంబర్  08578 విశాఖపట్నం–చర్లపల్లి మీదుగా జూన్​ 6  నుంచి జులై 25 వరకు ప్రతి శుక్రవారం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

ట్రైన్​ నంబర్  08580 చర్లపల్లి–విశాఖ పట్నం మధ్య జూన్​7 నుంచి జులై  26 వరకు ప్రతి శనివారం 8 సర్వీసులు నడుస్తాయి’’ అని అధికారులు వివరించారు. ఆ  ప్రత్యేక రైళ్లన్నీ దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్​లలో ఆగుతాయని చెప్పారు.