ఇక ఈజీగా హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు..సదరన్ డిస్కం  కొత్త విధానం

ఇక ఈజీగా హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు..సదరన్ డిస్కం  కొత్త విధానం
  • పారదర్శక సేవల కోసం ఆటోఎస్టిమేట్ సాఫ్ట్​వేర్ అభివృద్ధి 
  • డిస్కం సీఎండీ ఫారూఖీ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైటెన్షన్​ (హెచ్ టీ) కనెక్షన్​ పొందేందుకు సదరన్​ డిస్కం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది.  వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు ఆటోఎస్టిమేట్  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్  విధానాన్ని అభివృద్ధి చేశామని సంస్థ సీఎండీ ముషారఫ్  ఫారూఖీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 33 కేవీ హై టెన్షన్ (హెచ్​టీ) కనెక్షన్  దరఖాస్తుల జారీ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా సులభతరం చేసేందుకు కొత్త విధానం రూపొందించామని సీఎండీ తెలిపారు.

హెచ్​టీ సర్వీస్  కనెక్షన్  కోసం దరఖాస్తు చేసిన వినియోగదారుల వివరాలను హైటెన్షన్  కన్య్జూమర్  సర్వీస్  కనెక్షన్ (హెచ్​టీసీఎస్​సీ) సిస్టం ద్వారా జీఐఎస్​ కోఆర్డినేట్లతో సేకరించి సాసా యాప్  ద్వారా నేరుగా సంస్థ హెడ్డాఫీసులోని చీఫ్ ఇంజినీర్ (కమర్షియల్) కు పంపిస్తామని ఆయన చెప్పారు. ‘‘ఈ సమాచారం ఆధారంగా సాసా యాప్  ఆటోమేటెడ్ ఎస్టిమేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తుంది. ఆ ఎస్టిమేట్  ఆమోదం పొందిన వెంటనే డిమాండ్  నోటీసు ఆటోమేటిక్​గా జనరేట్  అవుతుంది.

ఈ వివరాలు వినియోగదారుడికి ఎస్ఎంఎస్​, ఈ -మెయిల్ ద్వారా అందుతాయి. అదే సమయంలో సంబంధిత అసిస్టెంట్  డివిజనల్  ఇంజినీర్ (ఏడీఈ), డివిజనల్ ఇంజినీర్ (డీఈ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) ఆపరేషన్  సిబ్బందికి ఎస్ఎంఎస్​ ద్వారా సమాచారం అందుతుంది. ఈ సింగిల్  విండో విధానం ద్వారా అన్ని అనుమతులు అతి తక్కువ సమయంలో జారీ అవుతాయి. కొత్త పరిశ్రమలు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సంస్థల యాజమాన్యాలకు హెచ్​టీ కనెక్షన్లను సులభతరం చేసేందుకు ఆటోఎస్టిమేట్  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్  విధానం ప్రవేశపెట్టాం” అని సీఎండీ వివరించారు. ఈ విధానంలో మధ్యవర్తుల అవసరం లేకుండా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని సీఎండీ తెలిపారు.