ఫెంటానిల్ డ్రగ్ లింక్ ఉన్న ఇండియన్‌‌ బిజినెస్ మెన్ వీసాలు రద్దు

ఫెంటానిల్ డ్రగ్ లింక్ ఉన్న ఇండియన్‌‌ బిజినెస్ మెన్ వీసాలు రద్దు

న్యూఢిల్లీ/లండన్: అమెరికాలో సంక్షోభానికి కారణమైన ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణాతో లింక్​ఉన్న ఇండియన్​ బిజినెస్ పర్సన్స్, వారి కుటుంబ సభ్యుల వీసాలను యూఎస్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి రీఅప్లికేషన్లను తిరస్కరించినట్టు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ గురువారం వెల్లడించింది. ఇకపై వారు యూఎస్​ప్రయాణానికి అనర్హులని పేర్కొంది. 

డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కొనేందుకు అమెరికా-, భారత్‌‌ నిబద్ధతతో పని చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో సహకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, వామపక్ష భావజాలమున్న ఎంటిఫా(యాంటీ ఫాసిస్ట్స్) సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దానిని అతి ప్రమాదకరమైన సంస్థగా పేర్కొన్నారు. బ్రిటన్​ పర్యటనలో ఉన్న ట్రంప్ ట్రూత్​ సోషల్‌‌లో ఈ ప్రకటన చేశారు.

బ్రిటన్‌‌ ప్రధానితో ట్రంప్ చర్చలు.. 

ట్రంప్​కు బ్రిటన్‌‌లో ఘన స్వాగతం లభించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తన భార్య మెలానియా ట్రంప్​తో కలిసి లండన్‎కు వచ్చిన ఆయనకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 ఆతిథ్యం ఇచ్చారు. గురువారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నివాసంలో ఆయనతో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సవరణ, రష్యా--–ఉక్రెయిన్, ఇజ్రాయెల్--–హమాస్ యుద్ధాలు, ఇతర వ్యూహాత్మక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.