- గ్రాము నామినల్ వ్యాల్యూ ఈసారి రూ. 5,923
- ఆన్లైన్లో కొంటే రూ. 50 డిస్కౌంట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా (ఆర్బీఐ) మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ తెస్తోంది. ఈ నెల 11 నుంచి 15 దాకా ఎస్జీబీ సిరీస్2 అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. తాజా ఎస్జీబీ ఇష్యూ కోసం సావరిన్ గోల్డ్ బాండ్ నామినల్ వాల్యూను గ్రాముకి రూ. 5,923 గా నిర్ణయించారు. ఇండియన్ బులియన్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రకటించే 999 గోల్డ్ రేటు ఆధారంగా ఈ ధరను నిర్ణయిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ పీరియడ్కి ముందు వారంలో చివరి మూడు రోజుల సింపుల్ ఏవరేజ్ రేటును బేస్ చేసుకుని ఎస్జీబీ నామినల్ వ్యాల్యూను లెక్కిస్తున్నారు. అంటే తాజా ఇష్యూ కోసం సెప్టెంబర్ 6, 7, 8 తేదీలను లెక్కలోకి తీసుకున్నారు.
డిస్కౌంట్....
ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసే వారికి నామినల్ వ్యాల్యూతో పోలిస్తే రూ. 50 డిస్కౌంట్ను సావరిన్ గోల్డ్ బాండ్స్పై ప్రభుత్వం అందిస్తోంది. ఇలాంటి ఆన్లైన్ ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ రూ. 5,873 (గ్రాము) కే దొరుకుతుందన్న మాట.
ఎస్జీబీ ఎలా కొనాలి....
ఎనిమిదేళ్ల టెనార్ ఉండే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ను బ్యాంకులు, స్టాక్హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (షిల్) , పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల నుంచి కొనవచ్చు. అయిదేళ్ల తర్వాత ఒకసారి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎస్బీఐ నెట్బ్యాంకింగ్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేసుకునే వీలుంది. ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్లోని డీమ్యాట్ అకౌంట్ వివరాలను ఇవ్వడం కోసం వన్టైమ్ రిజిస్ట్రేషన్ను ఇన్వెస్టర్లు చేసుకోవల్సి ఉంటుంది.
వడ్డీ 2.50 శాతం....
సావరిన్ గోల్డ్ బాండ్స్ నామినల్ వ్యాల్యూపై ఇన్వెస్టర్లు ఏటా 2.50 శాతం చొప్పున ఫిక్స్డ్ రేటు వడ్డీ చెల్లిస్తారు. ఆల్టర్నేటివ్ ఇయర్స్లో ఈ వడ్డీ చెల్లింపు ఉంటుంది. సింగిల్ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే ఆన్లైన్లో ఎస్జీబీలు కొనే అవకాశం కల్పిస్తున్నారు. జాయింట్ ఇన్వెస్ట్మెంట్లకు అనుమతి లేదు. సావరిన్గోల్డ్ బాండ్స్లో పెట్టుబడికి ఒక హోల్డింగ్ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ బాండ్స్ను డీమ్యాట్లోకి కన్వర్షన్ చేసుకునే వీలుంది.