- ఎస్పీ బి.రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డయల్ 100కు ఫోన్ రాగానే పోలీస్లు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు. లక్ష్మీ దేవిపల్లి పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
పోలీస్ స్టేషన్ను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా పోలీస్లు వ్యవహరించాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, చంద్రశేఖర్ ఉన్నారు.
