ట్రాక్టర్ కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు : ఎస్పీ బాలస్వామి

ట్రాక్టర్ కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు : ఎస్పీ బాలస్వామి

మెదక్ టౌన్, వెలుగు : ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్​వీల్స్​తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాక్టర్లను కేజ్ వీల్స్​తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడిపడం వల్ల రోడ్లు డ్యామేజ్​అవుతాయన్నారు.  ఈ విషయంలో ట్రాక్టర్​యజమానులు, డ్రైవర్లు సహకరించాలని సూచించారు. లేదంటే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.