సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
  •     ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ గౌస్​ ఆలం 

ఆదిలాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్​ జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. శనివారం భద్రతా చర్యల్లో భాగంగా హెలీప్యాడ్, బహిరంగ సభాస్థలం, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ‘ఐ లవ్ ఆదిలాబాద్’ ప్రాంతం, కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా, జగ్జీవన్ చౌక్, కలెక్టర్ చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున శాంతినగర్ మీదుగా వినాయక్ చౌక్ రోడ్డును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

రిమ్స్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు ఒకవైపు రెండు రాకపోకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లే దారి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు సాధారణ వాహనాలు, ప్రజలకు అనుమతి ఉండదన్నారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీలు సి.జాన్ రావు, సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, ప్రకాశ్, సీఐలు సత్యనారాయణ, ఫణిదర్, చంద్రశేఖర్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్ నవీన్, సిబ్బంది ఉన్నారు