కామారెడ్డిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు : నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. సోమవారం బీబీపేట పోలీస్​ స్టేషన్​ను ఎస్పీ తనిఖీ చేశారు.  సిబ్బంది రోల్​ కాల్​ను పరిశీలించారు.  స్టేషన్ రికార్డులు, వివిధ కేసులకు సంబంధించిన ఫైల్స్​ పరిశీలించి మాట్లాడారు. 

.కేసుల దర్యాప్తులో కానిస్టేబుల్స్ పాత్ర కీలకమన్నారు. గస్తీ పెట్రోలింగ్​ ముమ్మరం చేయాలన్నారు. ఆయా చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలన్నారు.   కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్యారెడ్డి, ఎస్సై ప్రభాకర్ తదితరులు ఉన్నారు.