స్పామ్ కాల్స్ ఆపాలంటే డీఎన్ డీ వాడాలి..ట్రాయ్ సూచన

స్పామ్ కాల్స్ ఆపాలంటే డీఎన్ డీ వాడాలి..ట్రాయ్ సూచన

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలో నంబర్లను బ్లాక్​చేయడం ద్వారా స్పామ్​ కాల్స్ ఆగవని,  వాటి గురించి తమ డు నాట్​ డిస్టర్బ్ (డీఎన్​డీ) యాప్​ ద్వారా తెలియజేయాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం తెలిపింది. 

ఈ యాప్​లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను బ్లాక్​ చేశామని వెల్లడించింది. ఫోన్లో నంబరును బ్లాక్​ చేస్తే మోసగాడు మరో నంబరుతో ఫోన్​ చేసే అవకాశం ఉందని  హెచ్చరించింది.