న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతోంది. ఎగ్జామ్స్ నిర్వహించాలని స్టూడెంట్స్తోపాటు వారి పేరెంట్స్ కోరుతున్నారని కేంద్రం అంటోంది. విద్యార్థుల రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్ను నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా గొంతెత్తాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Unite your voice with lakhs of suffering students. #SpeakUpForStudentSafety from 10am onwards.
Let’s make the Govt listen to the students.लाखों परेशान छात्रों के साथ अपनी आवाज़ जोड़िए। #SpeakUpForStudentSafety आज 10 बजे से।
आइए, सरकार से छात्रों की बात सुनने की माँग करें। pic.twitter.com/NBri5lx8Ff— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020
‘లక్షలాది స్టూడెంట్స్కు మద్దతుగా మీ గొంతుకను వినిపించండి. విద్యార్థుల సేఫ్టీపై ఉదయం 10 గంటల నుంచి గళమెత్తండి. ప్రభుత్వానికి స్టూడెంట్స్ గొంతుక వినిపడేలా చేద్దాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు తలెత్తే సమస్యలపై ప్రజా ఉద్యమం చేద్దామంటూ రాహుల్ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతోందని సదరు వీడియో వాయిస్ ఓవర్లో వినిపిస్తోంది. స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తరఫున కాంగ్రెస్ నిలబడుతోందని వీడియోలో కాంగ్రెస్ పేర్కొంది.