ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. జంగారెడ్డి గూడెం మరణాలపై అసత్య ప్రకటన చేశారని టీడీపీ నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు టీడీపీ సభ్యులు. అసెంబ్లీలో అసత్యాలా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మరణాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ కు అడ్డుతగలడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం