సికింద్రాబాద్, వెలుగు: కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా సిటీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జేబీఎస్ మీదుగా కొమురవెల్లికి వెళతాయని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8.30, మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం 5.40 గంటలకు అందుబాటులో ఉంటాయన్నారు. కొమురవెల్లి నుంచి ఉదయం 10.50, మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.50 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.