నేటి నుంచి కొమురవెల్లికి ప్రత్యేక బస్సులు

నేటి నుంచి కొమురవెల్లికి ప్రత్యేక బస్సులు

సికింద్రాబాద్, వెలుగు: కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా సిటీ నుంచి  ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు  గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్ ఆర్టీసీ జోన్‌‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ వెంకటేశ్వర్లు తెలిపారు.  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి జేబీఎస్​ మీదుగా కొమురవెల్లికి వెళతాయని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి ఉదయం 8.30, మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం 5.40 గంటలకు  అందుబాటులో ఉంటాయన్నారు.  కొమురవెల్లి నుంచి ఉదయం 10.50, మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.50 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.