ఓటరు నమోదుపై స్పెషల్ క్యాంపెయిన్ : రోనాల్డ్ రాస్

ఓటరు నమోదుపై స్పెషల్ క్యాంపెయిన్ : రోనాల్డ్ రాస్
  • ఓటరు జాబితా, నమోదుపై .. స్పెషల్​ క్యాంపెయిన్​ రోస్​
  • ఇయ్యాల, రేపు, సెప్టెంబర్ 2,3 తేదీల్లో నిర్వహణ
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ ​

సికింద్రాబాద్​, వెలుగు: ఓటరు జాబితా తయారీలో భాగంగా ఇయ్యాల, రేపు, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్​లో  భాగంగా 18 ఏళ్లు నిండినవారు, ఇప్పటి జాబితాలో పేరు నమోదు కానివారు, 1 అక్టోబర్ 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు కూడా ఓటరు నమోదుకు అర్హులని పేర్కొన్నారు. 

ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా పోలింగ్ బూత్ బీఎల్​వో వద్ద ఉంటుందని, మీ పేరు ఉందో, లేదో, ఏమైనా తప్పులున్నా  వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. కొత్త ఓటరు నమోదు, ఫారం-–6 ద్వారా,  మార్పులు, చేర్పులకు ఫారం–-8 ద్వారా ఆఫ్​ లైన్ అయితే  సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ప్రత్యేక క్యాంపెయిన్ తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. 

ఆన్​లైన్​లో  https://voters.eci.gov.in లేదా  voter helpline  మొబైల్ యాప్​ను డౌన్​లోడ్  చేసుకొని కూడా సవరణలు చేసుకోవచ్చన్నారు. తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వద్ద  బీఎల్​వో అవసరమైన ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలని, బూత్ స్థాయి అధికారి హాజరు కాకుంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం ఈఆర్వోలను ఆదేశించారు. పూర్తి వివరాలు, ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చనిఆయన కోరారు.