మహారాష్ట్ర మంత్రి, NCP నేత నవాబ్ మాలిక్ కస్టడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ప్రత్యేక PMLA కోర్టు మార్చి 7 వరకు పొడిగించింది. దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ కస్టడీ ఇవాళ్టి (గురువారం) తో ముగిసింది. ప్రత్యేక కోర్టు ఆయన్ని 8 రోజులు ED కస్టడీకి పంపింది. నవాబ్ మాలిక్ తన అరెస్టు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 7న హైకోర్టులో విచారణకు రానుంది.
బాంబే హైకోర్టులో నవాబ్ మాలిక్ పై విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో..ఆయన పిటిషన్పై స్పందించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టును కోరింది. EDకి కోర్టు మార్చి 7 వరకు సమయం ఇచ్చింది. హైకోర్టు మార్చి 7న విచారణను విచారించనుంది. రాజకీయ కారణాల వల్ల తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకున్నట్లు మాలిక్ సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నవాబ్ మాలిక్ ముంబైలోని కుర్లాలో రూ.300 కోట్ల విలువైన మునీరా ప్లంబర్ భూమిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసి రూ.20 లక్షలకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Special PMLA court extends the Enforcement Directorate (ED) custody of Maharashtra minister and NCP leader Nawab Malik till 7th March. He was connected by ED in connection with Dawood Ibrahim money laundering case.
— ANI (@ANI) March 3, 2022
(File photo) pic.twitter.com/4P2buZth02
మరిన్ని వార్తల కోసం..
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న మరో 798 మంది