హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. TRS విజయ గర్జన సభ కోసం భూములు ఇవ్వమంటున్నారు రైతులు. సభా స్థలం కోసం భూములు పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు, పోలీసులను అడ్డుకున్నారు. హసన్ పర్తి సీఐతో రైతులు వాగ్వాదానికి దిగారు.. దౌర్జన్యంగా భూములు లాక్కొని సభ పెడుతామంటే ఊరుకునేది లేదంటున్నారు రైతులు. వ్యవసాయ భూములు, ప్లాట్లలో మీటింగ్ ఎలా పెడుతారని ప్రశ్నించారు. భూములు చదును చేసి మీటింగ్ పెడితే హద్దులు చెడిపోతాయన్నారు. అంతే కాదు భూవివాదాలు తలెత్తుతాయని మండిపడ్డారు. మరో 15 రోజులు అయిపోతే... పంటలు కోతకు వస్తాయని ఇలాంటి టైంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సరైంది కాదన్నారు. సభ కోసం ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.