ప్రతి శుక్రవారం .. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్

ప్రతి శుక్రవారం ..  హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్

సికింద్రాబాద్, వెలుగు :  అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ  నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుందని  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయోధ్యలో ఈ నెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్ పూర్ – గోరఖ్ పూర్ (నెంబర్ 15024) ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్ లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది.10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బల్హర్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్ పూర్ వెళ్తుందని  రైల్వే అధికారులు తెలిపారు.