
గండిపేట్, వెలుగు: రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో వేగంగా వెళ్తున్న లారీ పల్టీ కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు నేలపాలయ్యాయి. శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు ఓ లారీ వేగంగా వస్తుంది. రాజేంద్రనగర్ పి.వి.నర్సింహ్మరావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 216 వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీ కొట్టింది.
దీంతో టమాట లోడ్ చెల్లాచెదురైంది. వాటిని అక్కడున్న వారు అందని కాడికి తీసుకొని వెళ్లిపోయారు. డ్రైవర్, క్లీనర్కు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.