
మెదక్ టౌన్, వెలుగు: పోలీస్సిబ్బందికి క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కలుగుతాయని ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు అన్నారు. మెదక్లోని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వారి కోసం క్రికెట్గ్రౌండ్ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాన్నారు. బుధవారం క్రికెట్ గ్రౌండ్కు భూమిపూజ చేశారు. యువ సిబ్బందిలో ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఈ మైదానం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖరరెడ్డి, సందీప్ రెడ్డి, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.