అంతర్జాతీయ స్థాయిలో రాణించాలె : రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలె : రేవంత్ రెడ్డి

కులమతాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు హింద్ కేసరి ఓ గొప్ప వేదిక అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో హింద్ కేసరి పేరిట జరుగుతున్న పోటీలను ఆయన వీక్షించారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. గెలిచిన వారు భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని.. ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపుకు పునాదులు వేసుకోవాలని సూచించారు.

క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలి : అర్వింద్

గతంలో క్రికెట్ ఆడేందుకు ఎల్బీ స్టేడియానికి వచ్చే వాడినని... ఇప్పుడు ఈ రెజ్లింగ్ పోటీలు చూసేందుకు రావడం ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ స్మారకంగా ఈ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.