షార్జా: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా మంగళవారం షార్జా వేదికగా ముంబైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు. పటిష్ట ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ముంబైకి మంచి ప్రారంభం దక్కలేదు. ప్రారంభంలోనే రోహిత్ శర్మ(4) ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు డీకాక్(25), సూర్యకుమార్ యాదవ్(36), ఇషాన్ కిషన్(33), పోలార్డ్(41) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. చివర్లో ఆల్ రౌండర్ పోలార్డ్(41) వరుస సిక్సర్లతో చెలరేగడంతో ముంబై ఫైటింగ్ స్కోర్ చేసింది. ఇక హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు కూడా రాణిస్తేనే ఈ మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలుంటాయంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు. ఆల్ ద బెస్ట్ SRH.
హైదరాబాద్ బౌలర్లలో..సందీప్ శర్మ (3) వికెట్లతో చెలరేగగా..నదీమ్ కు (2), హోల్డర్(2), రషీద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.
That's it from the first innings!
MI – 149/8 (20)
? – 150 runs#SRHvMI #OrangeArmy #KeepRising— SunRisers Hyderabad (@SunRisers) November 3, 2020