యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి గంట

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ధర్మదర్శనానికి 3 గంటలు,  స్పెషల్‌‌ దర్శనానికి గంట
  • ఆదివారం ఒక్కరోజే రూ.49.68 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.49,68,644 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.18,21,600, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.34 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9 లక్షలు, బ్రేక్‌‌ దర్శనాలతో రూ.3,68,100 ఇన్‌‌కం వచ్చినట్ల ఆఫీసర్లు వెల్లడించారు.