
కొలంబో: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక గెలుపు దిశగా సాగుతోంది. పాథుమ్ నిశాంక (158), కుశాల్ మెండిస్ (84) చెలరేగడంతో.. 290/2 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్లో 116.5 ఓవర్లలో 458 రన్స్కు ఆలౌటైంది. ఫలితంగా 211 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. తైజుల్ ఇస్లామ్ 5, నయీమ్ హసన్ 3 వికెట్లు తీశారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆట ముగిసే టైమ్కు 38.4 ఓవర్లలో 115/6 స్కోరు చేసింది. లిటన్ దాస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ముష్ఫికర్ రహీమ్ (26) టాప్ స్కోరర్. షాద్మాన్ ఇస్లామ్ (12), అనాముల్ హక్ (19), మోమినల్ హక్ (15), నజ్ముల్ హుస్సేన్ శాంటో (19), మెహిదీ హసన్ మిరాజ్ (11) ఫెయిలయ్యారు. ప్రభాత్ జయసూరియా, ధనంజయ్ డి సిల్వా చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం బంగ్లా ఇంకా 96 రన్స్ వెనకబడి ఉంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో బంగ్లా గెలవడం కష్టం.