కొలంబో: ఆర్థిక సంక్షోభంతో దేశం కష్టాల్లో ఉన్న సమయంలో శ్రీలంక క్రికెట్ జట్టు తమ ఆటతో అభిమానులను అలరించింది. పన్నెండేళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో 4 పరుగుల తేడాతో ఆసీస్పై లంక ఉత్కంఠ విజయం సాధించింది. దాంతో, మరో మ్యాచ్ మిగిలుండగానే 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 49 ఓవర్లలో 258 రన్స్కు ఆలౌటైంది. చరిత్ అసలంక (110) సెంచరీ, ధనంజయ డిసిల్వ (60) ఫిఫ్టీతో రాణించారు. అనంతరం ఛేజింగ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (99) అద్భుతంగా పోరాడినా ఆసీస్ 50 ఓవర్లలో 254 స్కోరుకే ఆలౌటైంది. చమిక కరుణరత్నె (2/19), ధనంజయ (2/39), వాండర్సే (2/40) సత్తా చాటారు. లంక చివరగా 2010లో ఆసీస్పై వన్డే సిరీస్ నెగ్గింది.