
కొలంబో: లెఫ్టార్మ్స్పిన్నర్ప్రభాత్జయసూరియా (5/56) కెరీర్లో 12వ సారి ఐదు వికెట్ల హాల్సాధించడంతో.. బంగ్లాదేశ్తో ముగిసిన రెండో టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్78 రన్స్ తేడాతో గెలిచింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్ను 1–0తో సొంతం చేసుకుంది. 115/6 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 44.2 ఓవర్లలో 133 రన్స్కే ఆలౌటైంది.
స్టార్టింగ్లోనే లిటన్ దాస్ (11) వికెట్ తీసిన జయసూరియా వరుస విరామాల్లో నయీమ్ హసన్ (5), తైజుల్ ఇస్లామ్ (6)ను ఔట్ చేశాడు. దీంతో 30 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా, తరిండు రత్నాయకే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాథుమ్ నిశాంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరుగుతుంది.