శ్రీలంకలో బురఖా బ్యాన్​

శ్రీలంకలో బురఖా బ్యాన్​

ప్రతిపాదించిన పార్లమెంటరీ కమిటీ

కొలంబో: బురఖాను వెంటనే బ్యాన్​ చేయాలని  నేషనల్​ సెక్యూరిటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ  శ్రీలంక సర్కార్​కు సిఫార్సు చేసింది.  ఎథ్నిక్​, మతాల ఆధారంగా  ఏర్పాటైన రాజకీయ పార్టీల  రిజిస్ట్రేషన్లను కూడా రద్దుచేయాలని ప్రతిపాదించింది.  పోయిన ఏడాది ఈస్టర్​ సందర్భంగా జరిగిన టెర్రర్​ అటాక్​లో 250 మంది చనిపోవడంతో  సెక్యూరిటీ ఇష్యూలో తీసుకోవాల్సిన చర్యలపై  పార్లమెంట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.   సెక్యూరిటీ అంశాలను పరిశీలించిన కమిటీ  స్పెషల్​ రిపోర్ట్​ను పార్లమెంట్ కు అందజేసింది.   చాలా దేశాల్లో బురఖాపై బ్యాన్​ అమల్లో ఉందని, పబ్లిక్​ ప్లేస్​లో బురఖా వేసుకున్నవాళ్లను తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని చెప్పింది. బురఖా తీయని వాళ్లను అరెస్టు  చేసే పవర్​ కూడా పోలీసులకు ఉంటుందని రిపోర్ట్​ తెలిపింది.   మూడేళ్లలో మదరసాలలో చదువుతున్న స్టూడెంట్స్​ అందరూ నార్మల్​ స్కూల్​ సిస్టమ్​లో చేరాల్సి ఉంటుందని కమిటీ సిఫార్సు​ చేసింది.