
ప్రతిపాదించిన పార్లమెంటరీ కమిటీ
కొలంబో: బురఖాను వెంటనే బ్యాన్ చేయాలని నేషనల్ సెక్యూరిటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ శ్రీలంక సర్కార్కు సిఫార్సు చేసింది. ఎథ్నిక్, మతాల ఆధారంగా ఏర్పాటైన రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను కూడా రద్దుచేయాలని ప్రతిపాదించింది. పోయిన ఏడాది ఈస్టర్ సందర్భంగా జరిగిన టెర్రర్ అటాక్లో 250 మంది చనిపోవడంతో సెక్యూరిటీ ఇష్యూలో తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సెక్యూరిటీ అంశాలను పరిశీలించిన కమిటీ స్పెషల్ రిపోర్ట్ను పార్లమెంట్ కు అందజేసింది. చాలా దేశాల్లో బురఖాపై బ్యాన్ అమల్లో ఉందని, పబ్లిక్ ప్లేస్లో బురఖా వేసుకున్నవాళ్లను తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని చెప్పింది. బురఖా తీయని వాళ్లను అరెస్టు చేసే పవర్ కూడా పోలీసులకు ఉంటుందని రిపోర్ట్ తెలిపింది. మూడేళ్లలో మదరసాలలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ నార్మల్ స్కూల్ సిస్టమ్లో చేరాల్సి ఉంటుందని కమిటీ సిఫార్సు చేసింది.