జనగణన పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

జనగణన పై  పూర్తి అవగాహన కలిగి ఉండాలి :  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
  •     జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఖిలా వరంగల్ (మామునూ రు), వెలుగు:  జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన   ఉండాలని  కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.ఆదివారం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో   జనగణన-2027 నిర్వహణపై   సెన్సెస్ క్లర్కులు , టెక్నికల్ అసిస్టెంట్లకు  శిక్షణ నిర్వహించారు.  జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహనతో బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. 

ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, వరంగల్ ఆర్డీఓ సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్  పాల్గొన్నారు.