కూకట్పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ .. నిందితులు అరెస్ట్

కూకట్పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ .. నిందితులు అరెస్ట్
  •  రూ.26 లక్షల విలువైన విగ్రహాలు, ఆభరణాలు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: కూకట్​పల్లి సర్దార్​పటేల్ నగర్​లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును కేపీహెచ్​బీ పోలీసులు ఛేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్​చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

నీలపు నీలయ్య అలియాస్ అనిల్15 చోరీ కేసుల్లో నిందితుడు. గత నవంబర్​లో జైలు నుంచి విడుదలై మహరాజు మల్లికార్జున్, భాస్య వెంకట్, మోహిత్​కుమార్, దున్నపోతుల పవన్​కల్యాణ్​అలియాస్ కల్యాణ్, దండి అనిల్​తేజ, కంబపు విజయ్, తంగిల్ల మణికంఠ దుర్గాప్రసాద్​అలియాస్​అఖిల్​తో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. 

సర్దార్​పటేల్​నగర్​లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి బంగారు, వెండి ఆభరణాలతోపాటు విగ్రహాలను సూట్​కేస్​లో పెట్టుకొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి, ఐదుగురు నిందితులను అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువైన  బంగారు, వెండి ఆభరణాలు, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నీలయ్య, వెంకట్, మోహిత్​కుమార్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.