డీ మార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి..బంధువుల ఆందోళన

డీ మార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి..బంధువుల ఆందోళన

హైదరాబాద్ శివారు వరస్థలిపురంలో  దారుణ జరిగింది. హయత్ నగర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ కు చెందిన సతీష్ అనే  విద్యార్థి  మృతి చెందాడు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న సతీష్(17)తన స్నేహితులతో కలిసి షాపింగ్ చేయడానికి వనస్థలిపురంలోని డీమార్ట్ కు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో సతీష్ కు గొడవ జరిగిందని.. సెక్యూరిటీ దాడి చేయడం వల్లే సతీష్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు పేరెంట్స్ అనుమతి లేకుండా కాలేజ్ యాజమాన్యం సతీష్ ను  ఎలా బయటకు పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్ సెక్యూరిటీ దాడి చేయడం వల్లే తన తమ్ముడు చనిపోయాడని సతీష్ సోదరుడు ఆరోపిస్తున్నాడు. సతీష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా మెల్లచేరువు మండలం జెగ్గు తండా.