డ్రగ్‌‌‌‌‌‌‌‌పై పోరాటానికి శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – కన్యాకుమారి బైక్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌

డ్రగ్‌‌‌‌‌‌‌‌పై పోరాటానికి శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – కన్యాకుమారి బైక్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌

జమ్మూ: కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బైక్‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ “ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ సొసైటీ” క్యాంపైన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వల్ల సమాజానికి జరిగే కీడును ఈ టీమ్‌‌‌‌‌‌‌‌ జనానికి తెలియజేస్తుంది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి శుక్రవారం బయలుదేరిన టీమ్‌‌‌‌‌‌‌‌ కన్యాకుమారి వరకు బైక్స్‌‌‌‌‌‌‌‌పై వెళ్తూ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. వారంలో దాదాపు 3806 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.

“ మేమంతా ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ బైకర్స్‌‌‌‌‌‌‌‌, నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లవర్స్‌‌‌‌‌‌‌‌. నిజానికి పోయిన ఏడాదే ఈ క్యాంపైన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నాం.. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పరిస్థితుల వల్ల ఒకరిని ఒకరు కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ కాలేకపోయాం. మా ట్రిప్‌‌‌‌‌‌‌‌కు ఎవరూ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయట్లేదు. సొంత ఆసక్తితో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై పోరాడాలని దీన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాం” అని రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముజామిల్‌‌‌‌‌‌‌‌ ఫయాజ్‌‌‌‌‌‌‌‌ భట్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.