
హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇన్ చార్జి సెక్రటరీగా శ్రీరాం వెంకటేశ్ను సర్కారు నియమించింది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న ఆయనకు అడిషనల్ బాధ్యతలు అప్పగించింది. నేడో, రేపో శ్రీరాం వెంకటేశ్ అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, ప్రస్తుతం కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీనివాస్రావును నకిరేకల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా బదిలీ చేసింది. దీంతో ఆయన బుధవారం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో వీడ్కోలు సమావేశం నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించారు.