
హైదరాబాద్ : శ్రీరామనవమి సంర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. సీతారాంబాగ్…రాణి అవంతీ భాయ్ ఆలయం నుంచి శ్రీ సీతా రాముల శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని వ్యాయామ శాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఇందులో శ్రీ రామ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పురాన్ పుల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 25 వందల మంది పోలీసులతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.