సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ఏప్రిల్ 12న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్లోని ఎమోషన్స్ చూపిస్తూ.. సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సీన్స్ ఇందులో ఉంటాయి. టీజర్, టైటిల్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అజయ్ అరసాడ, హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది’ అని అన్నాడు. నిర్మాత మాట్లాడుతూ ‘నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది’ అని చెప్పారు.