శ్రీశైలం మల్లన్న చెంత భారీ వర్షం కురిసింది. ఈరోజు ( ఆగస్టు 30) ఉదయం ఒక్కసారిగితా చల్లబడ్డ వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం ధాటికి భక్తులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షంలోనే భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తున్నారు. మూడు గంటల (వార్తరాసే సమయానికి ముందు) నుండి వదలకుండా కురిసిన వర్షంతో ఆలయ ప్రధాన వీధులు మొత్తం జలమయంతో నిండిపోయాయి. వర్షం కురుస్తుండడంతో కొంతమంది భక్తులు వసతిగృహాలకే పరిమితమయ్యారు, ఉదయం నుండి వర్షం కురుస్తుండడంతో ఆలయ ప్రధాన వీధులు తడిసి చిత్తడి చిత్తడిగా మారాయి.....
ALSO READ :అరేయ్ అది పులిరా..పిల్లి కాదు.. ఇది వెజిటేరియనా...అట్లా ఆడుకుంటున్నా ఏం అనడం లేదు