- పవర్హౌస్లు మినహా ఔట్లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే
- కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయం
- ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ
- కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. గురువారం జలసౌధలోని కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్కుమార్చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టులు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణ రెడ్డి, మురళీధర్ ఓకే చెప్పారు. పవర్హౌస్లు మినహా మిగతా అన్ని ఔట్లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. పవర్హౌస్లపై మరోసారి సమావేశం కానున్నారు. గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే, రివర్స్లూయిజ్లు, ఏపీ భూభాగంలోని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి పంప్హౌస్, ముచ్చుమర్రి పంప్హౌస్, తెలంగాణ భూభాగంలోని కల్వకుర్తి లిఫ్ట్స్కీం పంపుహౌస్ లను బోర్డు నిర్వహణకు అప్పగించాలని నిర్ణయించారు.
నాగార్జునసాగర్ప్రాజెక్టులోని స్పిల్ వే, రైట్, లెఫ్ట్కెనాళ్లహెడ్రెగ్యులేటర్స్, ఫ్లడ్ఫ్లో కెనాల్ హెడ్ రెగ్యులేటర్, ఏఎమ్మార్ లిఫ్ట్స్కీం పంపుహౌస్, రివర్, చూట్ స్లూయిజ్లు బోర్డు నిర్వహణలోకి వెళ్లనున్నాయి. ఆయా ఔట్లెట్ల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ పర్యవేక్షణలో చేయాలని, ఒక్కో ఔట్లెట్వద్ద రెండు రాష్ట్రాల నుంచి ఇంజనీర్లను, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో ఆయా ఔట్లెట్ల వద్ద రెండు రాష్ట్రాల సిబ్బంది పని చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఆయా ఔట్లెట్ల వద్ద మూడు షిఫ్టుల్లో కలిపి 30 మంది చొప్పున సిబ్బందిని డిప్యూట్ చేయాలని, వారు బోర్డు నియంత్రణలో పని చేస్తారని నిర్ణయం తీసుకున్నారు.
ఏ ఔట్లెట్ నుంచి నీటిని విడుదల చేయాలన్నా కేఆర్ఎంబీ త్రీ మెంబర్కమిటీ (బోర్డు మెంబర్సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కలిపి ఉన్న కమిటీ) నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాగార్జున సాగర్ఆపరేషన్స్అండ్మెయింటనెన్స్పనులు తెలంగాణ చూస్తున్నందున.. శ్రీశైలం రిపేర్లు, ఓ అండ్ఎం పనులు ఏపీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ప్రాజెక్టుపైనే సీఆర్పీఎఫ్బలగాలను మోహరించాలని, ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుపై అవసరం లేదని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులపై ఉన్న ఔట్లెట్ల నిర్వహణకు నియమించే సిబ్బంది వేతనాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాజెక్టుల ఆపరేషన్నే ఆర్ఎంబీకి అప్పగించాం: తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ను కేఆర్ఎంబీకి అప్పగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్తెలిపారు. కేఆర్ఎంబీ మీటింగ్అనంతరం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ఓ అండ్ఎంను ఏపీ.. నాగార్జునసాగర్ఓ అండ్ఎం తెలంగాణ చూసుకుంటుందని, ఇకపై ప్రాజెక్టులు బోర్డు పరిధిలోనే నడుస్తాయని తెలిపారు. పవర్స్టేషన్హ్యాండోవర్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
కృష్ణాలో తెలంగాణకు 50% వాటా ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాశామని, వాటిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నీటి విడుదలపై త్రీ మెంబర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టులపై మొహరించే సీఆర్పీఎఫ్బలగాలు కూడా బోర్డు పరిధిలోనే పని చేస్తాయన్నారు. ప్రాజెక్టులను పూర్తిగా బోర్డుకు అప్పగించలేదని.. ఆపరేషనల్, నీటి విడుదల చూసుకుంటుందని తెలిపారు.
ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరం లేదు: ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమ రాష్ట్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్కోసం రెండు రాష్ట్రాల నుంచి స్టాఫ్కేటాయిస్తామని, వాటర్రిలీజ్పై త్రీమెంబర్కమిటీదే తుది నిర్ణయమన్నారు. ఆయా ప్రాజెక్టుల్లో అప్పుడు నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా త్రీమెంబర్కమిటీ ఆపరేషనల్ ప్రొటోకాల్పై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏపీ తాగునీటి కోసం మార్చిలో కుడి కాలువనుంచి 3 టీఎంసీలు, ఎడమ కాలువ 2 టీఎంసీలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేషన్ను బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ కూడా ఒప్పుకుందన్నారు.
ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోం: ఇరిగేషన్ సెక్రటరీ
నీటి వాటాలు తేలేవరకు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రొటోకాల్పై స్పష్టత వచ్చే వరకు ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలంగాణ ఇరిగేషన్సెక్రటరీ రాహుల్బొజ్జా తెలిపారు. జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోని మినిట్స్పై అభ్యంతరాలు తెలుపుతూ ఆయన జనవరి 27న ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖను గురువారం సాయంత్రం మీడియాకు రిలీజ్చేశారు. తాము లేవనెత్తిన అంశాలను మినిట్స్లో చేర్చలేదని.. ఆ మీటింగ్లోనూ తాము ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ రీ ఆర్గనైజేషన్యాక్ట్ లోని షెడ్యూల్–12 ప్రకారం ఏ రాష్ట్ర భూభాగంలోని హైడల్పవర్ప్లాంట్లు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించబోమని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణలో అత్యంత కీలకమైనది ఆపరేషనల్ప్రొటోకాల్ అని, దీనిని బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ –2) ఖరారు చేయాల్సి ఉందని, నీటి వాటాలు తేల్చాల్సింది కూడా ఆ ట్రిబ్యునల్అని పేర్కొన్నారు. నీటి వాటాలు తేలేవరకు, కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇస్తే తప్ప ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్నారు.
శ్రీశైలం నుంచి ఏపీ ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తున్నదని, దీనిని అడ్డుకోవాలని కోరారు. శ్రీశైలం రైట్ బ్యాంక్కెనాల్కు 19, చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్నుంచి తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని అన్నారు. శ్రీశైలం నీటి వినియోగానికి ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలని, నాగార్జునసాగర్డ్యామ్పై తెలంగాణ భూభాగంలో సీఆర్పీఎఫ్బలగాల మోహరింపు అవసరం లేదని తెలిపారు. వెంటనే కేంద్రం జనవరి 17వ తేదీ మీటింగ్మినిట్స్లో తెలంగాణ అభ్యంతరాలను చేర్చి మళ్లీ మినిట్స్జారీ చేయాలని ఆయన లేఖలో కోరారు.