సెప్టెంబర్ 25న ఆన్ లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు

సెప్టెంబర్ 25న ఆన్ లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు

ఈ నెల 25వ తేది నుంచి ఆన్ లైన్‌లో సర్వదర్శన టోకేన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తున్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్, కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేశారు. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టోకెన్లు నిలిపివేస్తూన్నామని ప్రకటించారు. 24 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు.

 

Read More:

బైడెన్ పిలుపు.. ప్రధాని మోడీ అమెరికా ప్రయాణం

‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

సామాన్యులకు దహనం.. స్వామీజీలకు సమాధి: ఇలా ఎందుకంటే?