RRR టీమ్‌తో ఢిల్లీలో రాజ‌మౌళి.. ఫొటోస్ వైరల్

RRR టీమ్‌తో ఢిల్లీలో రాజ‌మౌళి.. ఫొటోస్  వైరల్

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్న పలు ఇండస్ట్రీ మేకర్స్ ను ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. మన టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డుకు ఎంపిక‌యిన విషయం తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ది రైజ్‌' మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీకి ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో కావడం విశేషం.

అలాగే రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీఆస్కార్, ది గోల్డెన్ గ్లోబల్ వంటి ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకోంది. మరోసారి RRR మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా, ఉత్త‌మ‌ నేపథ్య సంగీతం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్‌లు, బెస్ట్ మెల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ లను  గెలుచుకుంది. ఈ అవార్డ్స్ అందుకోవడానికి SS రాజమౌళి, MM కీరవాణి, SS కార్తికేయ టెక్నికల్ టీమ్ అంతా కలిసి ఢిల్లీ బయలుదేరిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

ALSO READ : ప్రభాస్ ఇన్‌స్టాపై వీడిన మిస్టరీ.. అసలు ఏమైందంటే ?

ఇవాళ అక్టోబర్ 17 మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ(Delhi)లోని విజ్ఞాన్ భవన్‌(Vigyan bhavan)లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈ అవార్డులను అందజేయనున్నారు.ఈ అవార్డుల వేడుక నిమిత్తం టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో ఢిల్లీకి బయలుదేరారు. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.