
స్టార్ డైరెక్టర్మణిరత్నం రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. అతను ‘బాహుబలి’ సినిమాను రెండు పార్టులుగా తీసుండకపోతే పొన్నియన్ సెల్వన్ అనే సినిమానే ఉండేది కాదన్నాడు. ఆ సినిమా స్ఫూర్తితోనే తాను ముందడుగు వేసినట్టు చెప్పాడు.
భారతీయ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా చేశాడని అభినందించాడు. చారిత్రక సినిమాలు చేయాలనుకునే మాలాంటి వారికి రాజమౌళి కొత్త బాటలు వేశాడన్నాడు. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్–2 ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.