రూ. 130 కోట్ల డిస్కౌంట్​ ఇవ్వండి.. బీసీసీఐని కోరిన స్టార్​ ఇండియా

రూ. 130 కోట్ల డిస్కౌంట్​ ఇవ్వండి.. బీసీసీఐని కోరిన స్టార్​ ఇండియా

న్యూఢిల్లీ: స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్​లను లైవ్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌ చేస్తున్న స్టార్​ ఇండియా..  ప్రస్తుత డీల్​లో రూ. 130 కోట్ల డిస్కౌంట్ ​ఇవ్వాలని బీసీసీఐని కోరింది. అలాగే జెర్సీ స్పాన్సర్​అయిన బైజుస్​ కూడా బ్యాంక్​ గ్యారంటీ కింద ఇచ్చిన రూ. 140 కోట్లను ఎన్​క్యాష్ చేయాలని బోర్డును కోరింది. ఈ విషయాలపై  సోమవారం  వర్చువల్‌‌‌‌గా జరిగిన బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ ఎమర్జెన్సీ  మీటింగ్‌‌‌‌లో బోర్డు పెద్దలు గంటపాటు చర్చించారు. ఐదేళ్ల కాలానికి (2018-–23) మీడియా రైట్ కోసం స్టార్ ఇండియా​.. బీసీసీఐకి రూ. 6138.1కోట్లను చెల్లిస్తోంది. అయితే కొవిడ్​–19 కారణంగా కొన్ని మ్యాచ్​లను రీ షెడ్యూల్​ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే రూ. 130 కోట్లు డిస్కౌంట్​ ఇవ్వాలని బోర్డును కోరుతోంది.  ఇక, నవంబర్​ 2023 వరకు ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని బైజుస్​ ఇప్పటికే బోర్డును కోరింది.