
న్యూఢిల్లీ: స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్లను లైవ్ స్ట్రీమ్ చేస్తున్న స్టార్ ఇండియా.. ప్రస్తుత డీల్లో రూ. 130 కోట్ల డిస్కౌంట్ ఇవ్వాలని బీసీసీఐని కోరింది. అలాగే జెర్సీ స్పాన్సర్అయిన బైజుస్ కూడా బ్యాంక్ గ్యారంటీ కింద ఇచ్చిన రూ. 140 కోట్లను ఎన్క్యాష్ చేయాలని బోర్డును కోరింది. ఈ విషయాలపై సోమవారం వర్చువల్గా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్లో బోర్డు పెద్దలు గంటపాటు చర్చించారు. ఐదేళ్ల కాలానికి (2018-–23) మీడియా రైట్ కోసం స్టార్ ఇండియా.. బీసీసీఐకి రూ. 6138.1కోట్లను చెల్లిస్తోంది. అయితే కొవిడ్–19 కారణంగా కొన్ని మ్యాచ్లను రీ షెడ్యూల్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే రూ. 130 కోట్లు డిస్కౌంట్ ఇవ్వాలని బోర్డును కోరుతోంది. ఇక, నవంబర్ 2023 వరకు ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని బైజుస్ ఇప్పటికే బోర్డును కోరింది.