సౌత్ సెంట్రల్ రైల్వేకు స్టేట్ అవార్డులు

సౌత్ సెంట్రల్ రైల్వేకు స్టేట్ అవార్డులు

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ 2022 అవార్డులకు దక్షిణ మధ్య రైల్వే ఎంపికైంది. వివిధ విభాగాల్లో పాటించిన పొదుపు చర్యలకుగాను తెలంగాణ నుంచి నాలుగు, ఏపీ నుంచి రెండు అవార్డులు గెలుచుకుంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణకు చెందిన అవార్డులను  హైదరాబాద్​లోని  విశ్వేశ్వరయ్య భవన్​లో మంత్రి జగదీశ్​​రెడ్డి, ఏపీ అవార్డులను  ఏపీ ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్​ అందజేశారు. తెలంగాణ అందించిన అవార్డుల్లో బిల్డింగుల కేటగిరీలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు గోల్డ్​మెడల్ లభించింది. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు సిల్వర్​మెడల్, ప్రభుత్వ బిల్డింగుల కేటగిరీలో  సికింద్రాబాద్ డీఆర్ఎం ఆఫీస్ కు గోల్డ్ మెడల్, ఎకౌంట్స్​ఆఫీస్​బిల్డింగుకు  సిల్వర్​మెడల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఆస్పత్రి బిల్డింగుల విభాగంలో  విజయవాడ డివిజన్ ​రైల్వే ఆస్పత్రికి గోల్డ్​మెడల్, ఆఫీస్​ బిల్డింగ్​కేటగిరీలో విజయవాడ ఎలక్ట్రిక్​ ట్రాక్షన్ ​సెంటర్​కు సిల్వర్​ మెడల్ ​లభించాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ ​మేనేజర్ ​అరుణ్​కుమార్​ జైన్​ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే ఎలక్ట్రికల్ విభాగం, సికింద్రాబాద్​, విజయవాడ, హైదరాబాద్​ డివిజన్ల మేనేజర్లు, సిబ్బందిని అభినందించారు. 

డోన్-కాచిగూడ సెక్షన్​ను తనిఖీ చేసిన రైల్వే జీఎం

హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ డోన్– కాచిగూడ సెక్షన్​ను మంగళవారం తనిఖీ చేశారు. ట్రాక్ డ్యూటీలు చేస్తున్న కార్మికులకు స్వెట్టర్లు, ఎక్విప్​మెంట్లను పంపిణీ చేశారు. డోన్, బోగోలు, వెల్దుర్తి సెక్షన్ల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ మలుపులు, ఎత్తు పల్లాలను పరిశీలించి.. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.