టీచర్​అర్హతకు టెట్‌‌‌‌

టీచర్​అర్హతకు టెట్‌‌‌‌

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌‌‌‌) 2023 నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌‌‌‌సీఈఆర్‌‌‌‌టీ) నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది.
అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌‌‌‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌(టీఆర్‌‌‌‌టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు పరీక్షకు హాజరుకావొచ్చు. 
ఎగ్జామ్​ ప్యాటర్న్​: టెట్‌‌‌‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1- నుంచి 5 తరగతులకు బోధించేందుకు పేపర్‌‌‌‌-1 రాయాలి. దానికి డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ విద్యార్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌‌‌‌సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్‌‌‌‌-2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు. ఒక్కో పేపర్‌‌‌‌కు 150 మార్కులు. టెట్‌‌‌‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌‌‌‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు ర్యాంకు నిర్ణయిస్తారు. 
దరఖాస్తులు: అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల కానున్నాయి. పూర్తి వివరాలకు www.tstet.cgg.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.