భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: శిశువు జన్మించిన 48 గంటల తర్వాత సికిల్ సెల్, అనీమియా, హైపోతలసేమియా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. జిల్లాలోని పలు హాస్పిటల్స్ను సోమవారం సందర్శించారు. అనంతరం డీఎంహెచ్లో ఆఫీస్లో డీఎంహెచ్, డీసీహెచ్ఎస్, ప్రోగ్రాం ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సికిల్ సెల్, అనీమియా, హైపోతల సేమియా స్క్రీనింగ్ టెస్టులను టీచింగ్ హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
స్క్రీనింగ్ టెస్టులు చేసే స్టాఫ్ నర్సులకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో కొత్త కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, చర్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఆయా టెస్టులపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.
