నేడు కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై

నేడు కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై

హన్మకొండ: ఇవాళ జరిగే కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై ఉదయం7.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి కేయూకు రోడ్డు మార్గం ద్వారా వస్తారు. 10 గంటలకు కేయూ గెస్ట్‌హౌస్‌లో గవర్నర్ కు వీసీ రమేశ్‌ స్వాగతం పలుకుతారు.

అల్పాహారం అనంతరం ఉదయం 10.15 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియానికి చేరుకుంటారు. స్నాతకోత్సవం సందర్భంగా ఆమె వేదికపై కీలక ఉపన్యాసం చేస్తారు. అనంతరం 56 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 276 మందికి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12.55 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. 3గంటలకు కేయూ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు.