
బషీర్బాగ్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్కీకరించి విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్ఆర్సీ ఆదేశించింది.