భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని పద్మావతి ఖని మైన్ మేనేజర్ ఆఫీస్లో మైన్కు సంబంధించి వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. బొగ్గు గనికి అవసరమైన పర్యావరణ అనుమతులపై డిస్కస్ చేశారు. బొగ్గు ఉత్పత్తి, కోల్ ట్రాన్స్పోర్టు వివరాలపై చర్చించారు.
అండర్ గ్రౌండ్లో పని ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం కేవీ ఓసీ మైన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏకో పార్కును సందర్శించారు. ఈ కమిటీలో డాక్టర్ ఎ. వెంకట రాజశేఖర్, డాక్టర్ సరిత సజ్జ, దినేస్ కుమార్లతో పాటు ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.
పద్మావతిఖని మైన్ను సందర్శించిన కోల్ క్వాలిటీ ఆర్గనైజేషన్ బృందం:
ఏరియాలోని పద్మావతిఖని మైన్ను కోల్ క్వాలిటీ ఆర్గనైజేషన్ బృందం సందర్శించింది. కోల్ గ్రేడ్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యతను పరిశీలించి గ్రేడ్ను డిసైడ్ చేస్తారు. ఈ ప్రోగ్రాంలో సీసీఓ శ్రీనివాస్, డీజీఎంలు దుర్గ ప్రసాద్, కేఎస్ఎన్ రాజు, ఏజెంట్ రాంభరోస్ మహతో, క్వాలిటీ కంట్రోల్ ఇంచార్జీ శ్రావణ్ కు మార్ పాల్గొన్నారు.
