మహబూబాబాద్, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) స్టేట్ లెవెల్ అండర్–19 బాస్కెట్బాల్ టోర్నమెంట్లో రంగారెడ్డి అమ్మాయిల టీమ్ చాంపియన్గా నిలిచింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో కెప్టెన్ మందాడి లక్ష్యారెడ్డి టీమ్ను ముందుండి నడిపించింది. తెల్లాపూర్లోని శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ స్టూడెంట్ అయిన ఆమె ఇతర ప్లేయర్లను సమన్వయం చేసుకుంటూ జట్టుకు ట్రోఫీ అందించింది. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ లక్ష్యారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.
