ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని రెండో దశలో పోలింగ్జరిగే ములుగు, వెంకటాపూర్మండలాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ములుగు మండలంలోని జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.
పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు ముసినపల్లి కుమార్గౌడ్, కూనూరు అశోక్ గౌడ్పాల్గొన్నారు.

