
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి – జూన్ మధ్య 66.14 మిలియన్ టన్నుల (ఎంటీ) క్రూడ్ స్టీల్ను ఉత్పత్తి చేశామని స్టీల్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కిందటేడాది ఇదే టైమ్లో ఉత్పత్తి చేసిన స్టీల్తో పోలిస్తే 5 శాతం గ్రోత్ నమోదు చేశామని వెల్లడించింది. ఇదే ట్రెండ్ రానున్న నెలల్లో కూడా కొనసాగుతుందని పేర్కొంది. కిందటేడాది జనవరి – జూన్ పీరియడ్లో 63 మిలియన్ టన్నుల (ఎంటీ) క్రూడ్ స్టీల్ను ఇండియా ప్రొడ్యూస్ చేసింది. స్టీల్ వాడకం పెరగడంతో ప్రొడక్షన్ కూడా పెరుగుతోందని, స్టీల్ కంపెనీలు తమ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకుంటున్నాయని ప్రభుత్వం వివరించింది.
దేశంలో స్టీల్ వినియోగం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం జనవరి–జూన్లో 11 శాతం గ్రోత్ నమోదు చేసింది. కిందటేడాది జనవరి –జూన్లో 52.7 మిలియన్ టన్నుల స్టీల్ను వినియోగించగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 58.4 మిలియన్ టన్నుల స్టీల్ను వాడాం. చైనా తన స్టీల్ ఎగుమతులు పెంచడంతో మన స్టీల్ ఎక్స్పోర్ట్స్ 30 శాతం పడిపోయాయని స్టీల్ మినిస్ట్రీ వెల్లడించింది. ‘ఇండియా స్టీల్ ఎగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 6.70 ఎంటీల నుంచి 4.74 ఎంటీలకు తగ్గింది. చైనా స్టీల్ చౌకగా దొరకడంతో మన ఎగుమతులు తగ్గాయి’ అని వివరించింది. కాగా, చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ స్టీల్ డిమాండ్ పడిపోయింది.